వెలిగొండ ప్రాజెక్ట్ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే. పి చెంచల్ బాబు యాదవ్.
వెలుగొండ ప్రాజెక్ట్ సాధించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి దక్కుతుందని మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ పోలిబోన చెంచల్ బాబు యాదవ్ తెలియజేసారు. 1996లో శంకు స్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ను మొదటి దశ ప్రారంభోత్సవం చేయడం, మెట్ట ప్రాంత ప్రజలకు ఒక వరమని, మెట్ట ప్రాంత ప్రజల జీవనాడిగా తెలియజేసారు. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా 4,46,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు సౌకర్యం—పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా—కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అని ఆయన అన్నారు.ఈ ప్రాంతంలో అనేకమంది మంచి నీరు లేక, ఫ్లోరింగ్ నీళ్లు తాగుతూ అష్టకష్టాలు పడుతున్నటువంటి సమయంలో, వెలుగొండ ప్రాజెక్ట్ను ప్రారంభోత్సవం చేయడం శుభపరిణామం అని, రెండో ఫేజ్ను 2028కి పూర్తి చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేయడం చాలా సంతోషదాయకమని, రెండో దశ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గానికి కూడా వెలుగొండ జలాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మాట ప్రకారం 2026లో వెలుగొండ జలాలను విడుదల చేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు కి, పవన్ కళ్యాణ్ కి, కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు.