కోదాడలో విషాదం.. విద్యుత్ షాక్తో యువకుడి మృతి
కోదాడ పట్టణంలో నూతన గృహ నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా విద్యుత్ షాక్తో తమ్మిశెట్టి గణేష్ (22) మృతిచెందాడు. నేరేడుచర్ల మండలం పొనుగోడుకు చెందిన గణేష్ నిర్మాణ పనుల్లో ఉండగా చేతిలోని ఇనుప పైపులు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.