రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా యానం పల్లి–సుద్ధపల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో మెంటజ్జుపల్లికి చెందిన గుర్రపు కిషన్ (46) మృతి చెందాడు. గుంతలను తప్పించేందుకు హోండా డియో స్కూటీకి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిషన్ వాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన కిషన్కు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించకపోవడంతోనే తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.